సీగేట్ వారి 350 జి.బి ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవు దాదాపు నిండుకోవడంతో - దాన్ని క్లీను చేస్తుంటే ఇది కనపడింది. ఫైలు డేటు చూస్తే 2007లో అని ఉంది. :) .. గుర్తు కూడా లేదు, ఎక్కడినుంచి వచ్చిందో...
విషయానికొస్తే - క్రిస్టియన్ లిటరేచర్ సొసైటి - ఎస్.పి.సి.కె ప్రెస్స్ మద్రాసు వారు 1894లో ముద్రించిన "తెలుగు పాఠముల మొదటి పుస్తకము" పుస్తకం అట్ట ఇది. 1894 సంవత్సరానికే 24th Edition, 6,000 - Total Copies 156,000 (156,000 సరిగ్గా చూడండి)..

ఈ పుస్తకం దేనికి సంబంధించిందో తెలీదు కానీ, ఔత్సాహికులు - ఇదే ఇదే తెలుగులో మొదటి పుస్తకం అని అరుస్తూండగా విన్నాను. నిజమెంతో తెలియదు. వేపేరి ప్రెస్సూ, పుట్టుపూర్వోత్తరాల సంగతులూ తెలుసు కానీ ఈ పుస్తకం గురించి ఇతర వివరాలు తెలిసినవాళ్ళు పంచుకోవచ్చు.
యాదృచ్ఛికంగా ఇది మూడొందల యాభయ్యో పోష్టు :)