Saturday, June 28, 2008
చిత్తూరు.వి.నాగయ్య గా పిలవబడే శ్రీ ఉప్పలదడియం నాగయ్య గారి గురించి ..
http://www.radio.maganti.org/
ఆ పాత మధురాలు! రేడియో కార్యక్రమం
ప్రతి శనివారం శాక్రమెంటో 88.7 కేబుల్ ఎఫ్.ఎంలో ఉదయం 10 నుండి 10.30 గంటల వరకు ప్రసారమయ్యే అచ్చతెనుగు రేడియో కార్యక్రమం మీ కోసం
Wednesday, June 25, 2008
(సినీ)కళాద్రష్ట బి.ఎన్. రెడ్డి - By శ్రీ పరుచూరి శ్రీనివాస్
http://www.eemaata.com/em/issues/200005/774.html
For those who have not read - చాలా అద్భుతమయిన వ్యాసం. ఇంత మంచి వ్యాసం చాలా ఆలస్యంగా చదివినందుకు చింతిస్తున్నా...
ఎంతో సమయం వెచ్చించి, మాకు తెలియని విషయాలు సేకరించి, విపులంగా పరిపూర్ణ రూపంలో మా ముందుంచినందుకు శ్రీనివాస్ గారు, మీకు మనఃస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
Vamsi
Tuesday, June 24, 2008
ఏదయినా నేర్చుకుంటారు..ఒక్క కథలేమిటి ?
ఒక రాజుకు ఏడుగురు కొడుకులు కథ - ఇలా ఉంటుంది అన్న మాట. 26 నెలల వైష్ణవి చెప్పిన కథ . ఒకవేళ లింకు కనపడకపోతే ఇక్కడ కనపడుతున్న లైను మీద నొక్కండి
http://www.maganti.org/audiofiles/vaishnavi/okarAjuku_EDugurukoDukulu.mp3
ఇంతకు ముందు ఒక టపాలో ఈ "పిల్లలకు కథ"విషయం గురించి చెప్పాను...కానీ మనం సమయం వెచ్చించి శ్రద్ధ తీసుకుని, మనసు పెట్టి, మన బాల్యంలో మన అమ్మమ్మలు, నానమ్మలు, అత్తయ్యలు, పిన్నులు, పెద్దమ్మలు చెప్పిన సరంజామా పిల్లలకు ఓపికగా చెపితే, వాళ్ళు వయసుతో నిమిత్తం లేకుండా ఏదయినా నేర్చుకుంటారు..ఒక్క కథలేమిటి ?
వంశీ
Monday, June 16, 2008
739 మంది ప్రత్యక్ష శ్రోతలకు సభాముఖంగా ధన్యవాదాలు
మొన్న శనివారం http://www.maganti.org/ చే సమర్పించబడి "వాయిస్ ఆఫ్ శాక్రమెంటో"లో ప్రసారమయిన "ఆపాత మధురాలు" రేడియో కార్యక్రమాన్ని ఇంటర్నెట్టులో , కేబుల్ ఎఫ్.ఎం. రేడియోలో విన్న 739 మంది ప్రత్యక్ష శ్రోతలకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము. అలాగే కార్యక్రమాన్ని చివరిదాకా విని, శ్రమతీసుకుని తమ అభిప్రాయాలను తెలియచేసిన వారందరికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు.
ప్రత్యక్ష ప్రసారాన్ని వినలేకపోయిన వారు http://www.radio.maganti.org/ లోని ఆర్కైవ్స్ సెక్షన్లో ఉన్న లింకులు నొక్కి , ప్రసారమయిన కార్యక్రమాలను వినవచ్చు
మాగంటి వంశీ, మాగంటి శ్రీదేవి
Saturday, June 14, 2008
ఆ పాత మధురాలు! రేడియో కార్యక్రమం మీ కోసం
ఆ పాత మధురాలు! రేడియో కార్యక్రమం
ప్రతి శనివారం శాక్రమెంటో 88.7 కేబుల్ ఎఫ్.ఎంలో ఉదయం 10 నుండి 10.30 గంటల వరకు ప్రసారమయ్యే అచ్చతెనుగు రేడియో కార్యక్రమం మీ కోసం
June 14న ప్రసారమయ్యే మొట్ట మొదటి కార్యక్రమం ఉదయం 10 గంటలనుండి 11 గంటల వరకు (IST - Indian Timings - Night 10.30 PM to 11.30 PM)కొనసాగే ఒక ప్రత్యేక కార్యక్రమం. తరువాతి శనివారం నుండి, "ఆపాత మధురాలు" ఉదయం 10 గంటల నుండి 10.30 వరకు (IST - Indian Timings - Night 10.30 PM to 11.00 PM)Regular Schedule లో ప్రసారం అవుతుంది .
ప్రత్యక్ష ప్రసారం వినలేకపోయినవారు Archives లింకు క్లిక్కు చేసి, పాత ప్రసారాలన్నిటినీ వినవచ్చు.
ప్రతివారం ఒక చిత్రరాజానికో, ఒక రంగస్థల నటుడికో, ఒక జానపద కళాకారుడికో, ఒక రచయితకో, ఒక సంగీతకారుడికో,ఒక మేకప్ మాన్ కో, ఒక ఆర్టు డైరెక్టరుకో, అద్భుతమయిన ప్రతిభ కలిగి ఉండి కూడా, కళాపోషకులు లేక మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోయిన ఎందరో మహానుభావులకు నీరాజనాలు అర్పిస్తున్న ఈ రేడియో కార్యక్రమం, తెలుగు గడ్డపై జన్మించి కళకే జీవితాన్ని అంకితం చేసి, అవిశ్రాంత కళాపిపాసతో ఆణిముత్యాల్లాంటి కళాఖండాలను సృష్టించి, మన జీవితాలను మనస్సులను స్పృశించి, వాటిలోని మాధుర్యాన్ని ఆస్వాదించమని మనకు వదిలి వెళ్ళిన ఆ కళామతల్లి ముద్దుబిడ్డలకు అంకితం
ఎందరో మహానుభావులు అందరికీ శతకోటి నమఃస్సుమాంజలులు
మాగంటి వంశీ మోహన్ , మాగంటి శ్రీదేవి
Sunday, June 8, 2008
డాక్టర్ సామల సదాశివ - "యాది"
http://www.maganti.org/mukhamukhiindex.html
Vamsi
శ్రీ ముద్దసాని రాం రెడ్డి గారు - (ఒక తెలంగాణా సాహితీమూర్తి )
http://www.maganti.org/mukhamukhiindex.html
Vamsi
Friday, June 6, 2008
చిన్నపిల్లలు ఇళ్ళల్లో పాఠాలు బట్టీపట్టే విధానాన్ని ఇలా....
"పూర్వము అప్పడని ఒక్కడుండెనూ. ఇద్దరు ఉండుటకు వీలులేకనే వక్కడు వుండెనూ. వానికి డబ్బుగల స్నేహితుడూ గలడు. అందువల్ల డబ్బు లేదూ. అందు స్నేహితుడు అప్పడికి మొహమాటంచే ప్రతి దినమూ ఒక వరహా బదులు ఇచ్చుచుండెనూ. ఇట్లుండగా ఒక దినమున అప్పడు ఇట్లాలోచించెనూ. వీడు నాకు రోజురోజూ వడ్డీ వరహా ఇస్తూ ఉన్నాడుగదా, వక్కసారే వంద ఎందుకు అడగరాదూ, వీడు ఇవ్వరాదూ. ఇట్లా యోచించి అట్లా అప్పుడు మిత్రుడని ఒకరోజున వక్కసారిగా వంద వరహాలు అడిగెనూ. వాడు వెంటనే నా వద్ద అంత డబ్బు లేదు గదా, ఏమి చేయుదునూ అని యోచించి, ఓరి అప్పుడూ, నా వద్ద లేదు అని చెప్పివేసెనూ. మొహమాటమూ పోయింది గావున మరునాడు ఒక వరహా కూడా యివ్వలేదూ..."
చిన్నపిల్లలు బిగ్గరగా చదువుతున్నప్పుడు వాక్యాంతాలను దీర్ఘాంతాలుగా పలకడం సహజం. విషయంతో సంబంధం లేకుండా కేవలం చదివే తీరును రమణ గారు రాయటం ఇందులో విశేషం...
ఆయన రాసిందే ఇంకో రచన - రాజకీయ భేతాళ పంచ వింశతి , నీతి సిగ్గూ లజ్జా లేని మన రాజకీయ నాయకుల మీద విదిలిచిన కొరడా. అందులో "చేప కథ" ఇలా సాగుతుంది
ఒక మంత్రి గారు భోజనం చేస్తున్నప్పుడు ఒక ఎండని చేప వస్తుంది. మిగతావన్నీ ఎండినప్పుడు దీనికేం రోగం? ఇదేం అసెంబ్లీ అనుకుందా? మునిసిపల్ కవున్సిల్ అనుకుందా? ఇండిపెండెంటు మెంబరుని అనుకుందా? అని కోపంతో ఆ మంత్రిగారు ఎంక్వైరీ కమీషనరుగా తనని తానే నియమించుకుని విచారణకు ఉద్యమించాడు
చేపా చేపా ఎందుకు ఎండలేదు?గడ్డిదుబ్బు అడ్డమొచ్చిందిట్రాక్టర్ మిషన్ వాడు ! ట్రాక్టర్ మిషన్ వాడ గడ్దిదుబ్బు నెందుకు కొట్టలేదు?కామందు చెప్పలేదు. ఆయన తన కొడుకుని ఇక్కడికి బదిలీ చేయించుకోవాలి అని చూస్తున్నాడు...
ఇలా విచారణ తిరిగి తిరిగి, ఎక్కడెక్కడో నడిచి తీగలాగితే డొంక కదిలినట్టు చివరికి తనకే ఎసరు వచ్చే పరిస్థితి వచ్చి ఫైలు మూసెయ్యాలి అని చూస్తాడు..కానీ అప్పటికే ఆ వార్త పత్రికలకెక్కిపోవడం వల్ల ప్రతిపక్షాల వాళ్ళు నివేదిక అడుగుతారు. అందుకు విరుగుడుగా మళ్ళీ ఒక సంఘం - ఈ సారి ప్రముఖులతో కూడింది ఏర్పడుతుంది. ఈ సంఘం వాళ్ళంతా చాలా చాలా ఊర్లల్లో సమావేశాలు నిర్వహించి, చివరాఖరికి ఉదకమండలంలో సమావేశంలో పరివేస్ఠితులై ఉండగా, అప్పటికి మూడునెలల కాలం గడిచిపోవటం వల్ల ఆ చేప గబ్బు లేస్తుంది. అప్పుడు ఆ చివరాఖరి సమావేశంలో వాసన వస్తోంది కాబట్టి చెత్తబుట్టలో పారెయ్యండి అని సూచిస్తారు. దాంతో సమావేశం ముగియటం, ఫైలు ముయ్యటం తటస్థిస్తుంది..